ఆ పరిస్థితుల్లో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా..కానీ వినలేదు.. చంద్రబాబు ఎమోషనల్..!

-

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 అక్టోబర్ 14 వ తేదీ నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో మొదటి గెస్ట్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇక ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తికరంగా చంద్రబాబు ఇంటర్వ్యూ సాగనుంది. ఇక తాజాగా బాలయ్య, చంద్రబాబు మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన అలాగే వివాదాస్పదమైన ప్రశ్నలను కూడా సంధించారు బాలయ్య.. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1995లో నేను తీసుకున్న ఆ నిర్ణయం తప్పా? అని బాలకృష్ణను అడగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

1995లో సీనియర్ ఎన్టీఆర్ ను తప్పని పరిస్థితుల్లో కాళ్లు పట్టుకున్నాను.. వేడుకున్నాను.. అయినా వినలేదు .. అని చంద్రబాబు భావోద్వేగంగా తెలిపారు. అయితే 1995లో జరిగిన దాని గురించి అసలు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారో అనేది తెలియాలి అంటే అక్టోబర్ 14 వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ ఎపిసోడ్ బాగోద్వేగంతో పాటు రొమాంటిక్ గా అలాగే ఫన్నీగా కూడా సాగింది. మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఒక ఎంటర్టైన్మెంట్ షో కి చంద్రబాబు రావడంతో ఈ షో పై ప్రస్తుతం చాలామంది ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ చాలు ఆహా ఓటీటీ రేటింగ్ పెరిగిపోవడానికి అంటూ కూడా నెటిజన్లు చెబుతూ ఉండడం గమనార్హం.

షో లో భాగంగా మీకంటే ఎక్కువ రొమాన్స్ చేశామని చెప్పిన చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆప్త మిత్రుడు అని కూడా తెలిపారు. మా చెల్లి.. మీ భార్య భువనేశ్వరుని ఏమని పిలుస్తావు బావ అని బాలకృష్ణ అడగగా భూ అని పిలుస్తానని చెప్పాడు. ఇక అంతేకాదు బాలయ్య అందరి ముందే చంద్రబాబు నాయుడుతో మా చెల్లికి ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పాలని పట్టుబట్టగా.. చంద్రబాబునాయుడు భువనేశ్వర్ కి ఫోన్ చేసి మీ బాలకృష్ణ నన్ను బాగా ఇరికించేశాడు అంటూ ఆద్యంతం నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news