ప్రేమ పెళ్ళి చేసుకున్నందుకు గోమూత్రం తాగించారు..!

-

ప్రేమ పెళ్ళిళ్ళు సర్వ సాధారణం అయిన ఈ రోజుల్లో కూడా ప్రేమికుల పై కొన్ని ప్రాంతాల్లో ఆటవిక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సి జిల్లా ప్రేమనగర్ లోని గౌల్ టోలీ కి చెందిన భూపేష్ యాదవ్, ఆష్టాజైన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి గ్రామపెద్దలకు ఇది నచ్చలేదు. వారిని వ్యతిరేకిస్తూ గ్రామ బహిష్కరన చేశారు. దీంతో ఆ జంట గ్రామం విడిచి మరోప్రాంతంలో కాపురం పెట్టారు.

అయిన సరే గ్రామ పెద్దలు శాంతించలేదు. గ్రామానికి చెందిన పలువురు ఆ అబ్బాయి కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారు. తన కుంటుంబానికి న్యాయం చేయాలంటూ భూపేష్ ఊరి గ్రామపెద్దల్ని ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. అక్కడి పెద్దలు పంచాయితీ లో చెప్పిన తీర్పు విని సమాజంలో ఆటవికత పూర్తిగా అంతరించిపోలేదు అనే వాస్తవం బయట పడింది. ఆ జంట ప్రేమ వివాహాన్ని వారు అంగీకరించాలంటే ఆష్టాజైన్ గోమూత్రం తాగి, ఆవుపేడ తినాలని తీర్పిచ్చారు.

ఇది సమాజసం కాదని తీర్పును మార్చాలని భూపేష్ తండ్రి సైతం గ్రామపెద్దల్ని కోరాడు. దీనికి గ్రామపెద్దలు ఒప్పుకోకపోవడంతో బాధితుడు జిల్లా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించాడు. ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలని మేజిస్ట్రేట్, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) డాక్టర్ ప్రదీప్ కుమార్ ను ఆదేశించారు. దీంతో గ్రామపంచాయితీ పెద్దలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భూపేష్ దంపతులకు భద్రత కల్పించారు. గ్రామపెద్దల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్ఎస్ పీ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేలదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news