పాపం చంద్ర‌బాబు.. ఇంటి గుట్టు మొత్తం శ్రీనివాసులు చేతుల్లో పెట్టేశాడు: ఎంపీ విజయసాయిరెడ్డి

-

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్వీట్ల దాడిని కొనసాగిస్తున్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజా రాజకీయ పరిణామాలపై కాస్త మసాలా తగిలించి ఎప్ప‌టిక‌ప్పుడు ట్వీట్‌లు చేస్తున్నారు విజయసాయి రెడ్డి. ఇక తాజాగా తన ఆర్థిక వ్యవహారాల పాస్‌వర్డ్‌ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పీఎస్‌ శ్రీనివాసులు వద్ద వదిలేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్‌ వేశారు.

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబునాయుడు తన తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా పీఎస్‌ శ్రీనివాసులు చేతుల్లో పెట్టేసి ఇప్పుడు బిక్కసచ్చిపోయారని ట్విట్టర్‌లో వ్యంగ్యోక్తి విసిరారు. ‘ఇంతా బతుకు బతికి ఇంటెనక…’ అన్నట్లు ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి తయారయ్యిందని వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ దాడుల్లో రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు దొరికాయని వైసీపీ ఆరోపిస్తుండగా, కాదు రెండు లక్షలే అని టీడీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో విజయ్‌సాయిరెడ్డి ఈ విధంగా ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news