సరిహద్దుల్లో ఎదురు పడుతున్న భారత్ చైనా… మరోసారి కీలక చర్చలు

-

భారత్ మరియు చైనా మధ్య తొమ్మిదవ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద జరుగుతున్నాయి. గత ఏడాది ఆగస్ట్ నుంచి రెండు దేశాల మధ్య పరిస్థితి దారుణంగా ఉంది. తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద… చైనా వైపున ఉన్న మోల్డో సరిహద్దు పాయింట్ వద్ద సైనిక స్థాయి చర్చలు జరుగుతున్నాయి.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజా సైనిక చర్చలలో భాగం కానున్నారు అని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. సైనిక చర్చలు ఎనిమిదవ మరియు చివరి రౌండ్ చుశుల్ లో అరిగాయి. నవంబర్ 6 న ఈ సమావేశం జరిగింది. దళాలు, ఫిరంగి తుపాకులు, యుద్ద ట్యాంకులు మరియు సాయుధ వాహనాలను సరిహద్దుల్లో భారీగా మొహరించారు. ఏకాభిప్రాయం కోసం రెండు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news