BREAKING : ఐదో టెస్టు మ్యాచ్ పూర్తిగా రద్దు

-

భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ ఐదో టెస్టు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కాసేపటి క్రితమే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది.

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యం లో ఐదో టెస్టు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా టీమిండియా శిబిరం  లో మరొకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. దీంతో ఐదు టెస్టుల మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉంది టీమిండియా.  కాగా ఇప్పటి కే టీమిండియా జట్టు హెడ్ కోచ్ అయిన… రవి శాస్త్రి మరియు సహాయక సిబ్బంది లో కొంత మంది కి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం కరోనా సోకిన వారు సెల్ఫ్ ఐసో లేషన్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news