హైదరాబాద్ లో ఇండియా, ఆసీస్‌ మ్యాచ్‌..ఇవాళ్టి నుంచే టిక్కెట్ల అమ్మకం

-

ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే టి20 మ్యాచ్ కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ కోసం భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ హైదరాబాదులో ఆడనుంది.

కాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లు గురువారం నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 55000, కాగా, టిక్కెట్టు ధరలు రూ.300 నుంచి రూ. 10వేల వరకు ఉండొచ్చు.

టికెట్లు డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం లో అలాగే పేటీఎం ఇన్సైడర్ లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే నగరవాసులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఇవాళ ఆన్లైన్ లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడై పోయే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news