ఇండియా కరోనా అప్డేట్… కొత్తగా 31,382 కేసులు

-

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు దేశం లో 31,382  కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా మొత్తం 32,542 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,00,162 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.19 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 318 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4, 46, 368 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,28, 48, 273 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 84, 15, 18, 026 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇక గడిచిన 24 గంటల్లో 72, 20, 642 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయ వంతంగా కొన సాగుతోంది. ఇప్పటికే 84 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేసింది కేంద్ర ఆరోగ్య సంస్థ.  డిసెంబర్‌ నాటికి పూర్తి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది సర్కార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news