ఇండియాలో కొత్తగా 2380 కరోనా కేసులు

-

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2380 నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,14,479 కు చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1231 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.76 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 214 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,22,062 కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,13,248 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,87,07,08,111 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15,47,288 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 13,433 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news