ఇండియాలో థర్డ్ వేవ్ విలయం.. ఒక్క రోజే దేశంలో కొత్తగా 2.86 లక్షల కరోనా కేసులు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,86,384 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,03,71,500 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,02,472 కు చేరింది. ఇక దేశం లో రోజు వారి కరోనా పాజిటివిటి రేటు 19.59 శాతంగా ఉంది. అలాగే దేశంలో యాక్టివ్ కేసుల శాతం 5.46 శాతంగా నమోదు అయింది.

ఇక దేశంలో తాజాగా 573 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,91,700 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,06,357 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,76,77,328 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63,84,39,207 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 22,35,267 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news