ఇండియాలో కొత్తగా 3,157 కరోనా కేసులు, 26 మరణాలు

-

భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3157 నమోదయ్యాయి.


దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,82,345 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2723 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.74 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 26 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,23,869 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,500 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,38, 976 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,89,23,98,347 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 4,02,170 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news