రెండో టీ20లో భారత్ ఘన విజయం.. 7 వికేట్ల తేడాతో శ్రీలంక చిత్తు

-

శ్రీలంకలో జరుగుతున్న రెండో టీ20లోొ టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టీ20 సిరీస్ ను ఇప్పటికే సొంతం చేసుకుంది. ధర్మశాలతో జరిగిన రెండో టీ20లో ఏడు వికేట్ల తేడాతో విజయం సాధించింది. నామమాత్రమైన మూడో టీ20 రేపు ధర్మశాల వేదికగానే జరుగనుంది. శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ లకు తోడు సంజూశాంసన్ కూడా బాధ్యతయుత ఇన్నింగ్స్ ఆడటంతో కేవలం మూడు వికేట్లను కోల్పోయి 17.1 ఓవర్లలోనే 184 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 బంతుల్లోనే 74 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 18 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 45 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. 

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికేట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇందులో నిస్సంక 53 బాల్స్ లో 75 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ శనక 19 బాల్స్ లో 47 రన్స్ చేశాడు.  భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు, భువనేశ్వర్, హర్షల్ పటేల్ తలో వికేట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news