Zim Vs Ind : వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు..

-

తొలుత ఇంగ్లండ్‌, త‌ర్వాత వెస్టిండీస్ టూర్ల‌లో రాణించిన భార‌త క్రికెట్ జ‌ట్టు తాజాగా జింబాబ్వే టూర్‌లోనూ స‌త్తా చాటింది. 3 వ‌న్డేల వ‌న్డే సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే… భార‌త చేజిక్కించుకుంది. జింబాబ్వేలోని హ‌రారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా సాగుతున్న రెండో వ‌న్డేలో జింబాబ్వే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని టీమిండియా బ్యాట‌ర్లు కేవ‌లం 25.4 ఓవ‌ర్ల‌లోనే చేధించి విజ‌యం సాధించారు. వెర‌సి ఇంకో వ‌న్డే మ్యాచ్ మిగిలి ఉండ‌గానే… టీమిండియా వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచాడు. అయితే శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33) రాణించారు. ఇషాన్ కిషన్ (6) విఫలమవగా.. దీప్ హుడా (25) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

IND vs ZIM 2nd ODI Highlights: India Won By 5 Wickets To Clinch Series 2-0  | India Tour of Zimbabwe |

అయితే ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్ (43 నాటౌట్) మరోసారి సత్తాచాటాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 26వ ఓవర్లో భారత విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా.. సిక్సర్‌తో విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే సిరీస్‌ను భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. జింబాబ్వే బౌలర్లలో ల్యూక్ జాంగ్వే రెండు వికెట్లతో సత్తా చాటగా.. తలన చివాంగ, విక్టర్ న్యూచి, సికందర్ రజా తలో వికెట్ తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news