కరోనా కల్లోలం : చాహల్, కృష్ణప్ప గౌతమ్ పాజిటివ్‌

-

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ వైరస్‌ ఇప్పుడు టీం ఇండియా జట్టును కుదిపేస్తోంది. ఇప్పటికే టీం ఇండియా ఆల్‌ రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకగా.. తాజాగా మరో ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

ఇవాళ తాజాగా భారత జట్టుకు చెందిన 31 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్, బౌలింగ్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ పరీక్షల్లో యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ లకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. మొదట పరీక్షలు చేయగా… నెగటివ్‌ వచ్చినప్పటికీ… ఇవాళ్టి పరీక్షల్లో మాత్రం వారిద్దరికీ పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ లతో సన్నిహితంగా ఉన్న మిగతా క్రికెటర్లు.. ఐసోలేషన్‌ కు వెళ్లారు. ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ లకు కరోనా ట్రీట్‌ మెంట్‌ అందిస్తున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news