నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్

-

లండన్ లోని.. ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో…. టీమిండియా భారీ విక్టరీని అందుకుంది. ఈ 4వ టెస్టు విజయంతో… దాదాపు యాభై ఏళ్ళ చరిత్రను తిరగరాసింది కోహ్లీ సేన. ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు పై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు కకావికలం అయ్యారు.

దీంతో తో 210 పరుగులకే… రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది ఇంగ్లాండ్ జట్టు. ఉమేష్ యాదవ్ ధాటికి… ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు వరుసగా పెవిలియన్ కు దారి పట్టారు. ఓపెనర్ బర్న్స్ 50 పరుగులు, ఆసీస్ హమీద్ 63 పరుగులు మరియు కెప్టెన్ రూట్ 36 పరుగులు మినహా ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఇండియా బౌలర్ల లో ఉమేష్ యాదవ్ 3, బుమ్ర 2, జడేజా 2, ఠాకూర్ 2 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news