మరో అంతర్జాతీయ వేడుకకు అమరావతి  ఆతిథ్యం..

-

గత రెండు రోజుల క్రితమే ఫార్ములా వన్ పవర్ బోటింగ్ రేసులతో అమరావతి పేరును అంతర్జాతీయంగా ప్రమోట్ చేసిన ఏపీ ప్రభుత్వం… మరో  అంతర్జాతీయ వేడుకకు ఆతిథ్యం ఇచ్చేందుకు  సిద్ధమైంది. ఏపీ రాజధాని అమరావతిలో నవంబర్ 23 నుంచి ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఎయిర్ షో -2018 పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి బేరం పార్క్ వేదిక‌ కానుంది.  ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రయల్ రన్ సహా ఐదు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమంతో పాటు ప్రత్యేక ఆకర్షనగా  పున్నమి ఘాట్‌లో క‌ల‌ర్ ఫుల్ క్రాక‌ర్ షో కూడా ఏర్పాటు చేశారు. గత వారం మూడు రోజుల పాటు జరిగిన పవర్ బోటింగ్ ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 –  75 దేశాలు టీవీల్లో వీక్షించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news