తెలంగాణ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన దూరం- ప‌వ‌న్‌
అమ‌రావ‌తి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సోమవారం నాటి ప్రకటనలో తెలిపింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన హైద‌రాబాదులో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ప్రణాళిక రూపొందించుకున్నామని.. అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో బరిలో నిలవడం కష్టతరంగా భావిస్తున్నట్టు ప్రకటించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపింది. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే తమ పార్టీ లక్ష్యమని.. ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్టు జనసేన పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news