టర్కీలో మరోసారి భూకంపం.. 200 మందికి పైగా..

-

వరుస భుకంపాలతో అల్లాడిపోతున్న టర్కీలో మరోసారి భూమి కంపించింది. హతాయ్ ప్రావిన్సులో ఈ భూకంపం వల్ల ముగ్గురు మరణించగా.. 213 మంది గాయపడ్డారు. భూకంప కేంద్రం డెఫ్నె నగర సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

టర్కీ, సిరియాలో సోమవారం 6.4 తీవ్రతతో భూమి సంభవించినట్లు టర్కీ మంత్రి సులేమాన్​ సోయ్లు తెలిపారు. అనేక భవనాలు కూలినట్లు వెల్లడించారు. రెస్క్యూ టీమ్​లు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. భూకంప ప్రభావం జోర్డాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది.

ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 46,000 మంది మరణించారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరూ తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. భూకంపం వల్ల ఒక్క టర్కీలో 40 వేల మందికిపైగా మరణించారు. సిరియాలో దాదాపు 6,000 మంది దుర్మరణం పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version