ట్విటర్ సీఈఓగా​ బాధ్యతలు స్వీకరించిన లిండా

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాను కొనుగోలు చేసిన ట్విటర్​ సంస్థకు ఇటీవలే కొత్త సీఈవోను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా​ ట్విటర్ కొత్త సీఈఓగా లిండా యాకరినో ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇక నుంచి ట్విటర్ వ్యాపార కార్యకలాపాలను.. పూర్తిగా లిండా యాకరినో చూసుకోనున్నారు. ట్విటర్ నూతన సీఈఓగా నియమితురాలైన లిండా యాకరినో.. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌ పర్సన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు పనిచేసిన ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ వైస్​ ప్రెజిడెంట్​.. జో బెనారోచ్ కూడా తన టీంలో చేర్చుకున్నారు లిండా.

“నేను ఓ భిన్నమైన వృత్తి సాహాసాన్ని ప్రారంభించనున్నాను. ట్విటర్ వ్యాపార కార్యాకలపాలపై దృష్టి సారించేందుకు ఆ బాధ్యతలను తీసుకుంటున్నాను. నా అనుభవం మొత్తాన్ని ట్విటర్​లో కేంద్రీకరించేందుకు ఎదురు చూస్తున్నాను. ట్విటర్ 2.0 నిర్మిచేందుకు.. టీం అందరితో కలిసి పని చేస్తాను.” అని జో బెనారోచ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news