బ్రిటన్ కింగ్ పట్టాభిషేకం.. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్​పై ప్యాలెస్ ప్రకటన..?

-

ఇవాళ ప్రపంచం ఫోకస్ అంతా బ్రిటన్​పైనే ఉంది. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలోనూ అక్కడ ఓ రాజుకు పట్టాభిషేకం జరుగుతోంది కనుక. బ్రిటన్ రాజుగా ఇవాళ ఛార్లెస్-3 పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఈరోజు ఆయనకు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి నేడు కిరీటధారణ చేయనున్నారు. ఈ సమయంలో రాజకుటుంబం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయితే ఈ వేడుకకు రాచరికాన్ని వదులుకున్న ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ , ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ వస్తారా..? లేదా..? అనేదీ ఆసక్తికరంగా మారింది. దీని గురించి బకింగ్‌ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన చేసింది. హ్యారీ వస్తున్నారని, మార్కెల్‌ మాత్రం హాజరుకావడం లేదని తెలిపింది.

‘మే 6వ తేదీ వెస్ట్‌మినిస్టర్ అబేలో జరుగుతోన్న పట్టాభిషేక కార్యక్రమానికి డ్యూక్‌ ఆఫ్ ససెక్స్ (ప్రిన్స్‌ హ్యారీ) హాజరవుతారు. ప్రిన్స్‌ ఆర్కీ, ప్రిన్సెస్‌ లిలిబెట్‌తో కలిసి డచెస్‌ ఆఫ్ ససెక్స్‌ (మేఘన్‌ మార్కెల్‌) కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు’ అని వెల్లడించింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news