మనిషి గుండెను తీసి ఆలుగడ్డలో వేసి కర్రీ చేశాడు..!

-

ప్రస్తుత కాలంలో కొంతమందిలో మానవత్వం అనేదే లేకుండా పోతోంది. కొందరు చేసే పైశాచికాలు చూస్తే మనిషుల్లోనూ ఇంత క్రూరత్వం ఉంటుందా అని భయపడాల్సి వస్తోంది. కొందరు ప్రత్యేర్థులను నడి రోడ్లపై కత్తులు, తుపాకిలతో దారుణంగా చంపుతుంటే.. మరి కొందరు కుటుంబ సభ్యులని చూడకుండా చంపేస్తున్నారు. ఇలాంటి ఓ భయంకరమైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపి అతని గుండెను తీసి కూర వండిన ఘటన ఇటీవల వెలుగు చూసింది. పోలీసులు విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 

20 ఏళ్లు జైల్లో ఉండి వచ్చాడు..

అమెరికాలోని ఓక్లహోమాలో లారెన్స్‌ పౌల్‌ అండర్‌సన్‌ అనే వ్యక్తి ఓ డ్రక్స్‌ కేసులో నిందితుడిగా మారి దాదాపుగా 20 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఇటీవల శిక్షకాలం పూర్తవడంతో ఇంటికి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తన ఇంటి సమీపంలోని ఓ వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి గుండెను పెక్కిలించి దాన్ని తీసుకొని మరోప్రాంతంలో ఉండే తన అంకుల్‌ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికెల్లిన తర్వాత గుండెను ముక్కలు ముక్కలుగా కోసి ఆలుగడ్డలతో కలిపి కూర వండి అంకుల్‌ కుటుంబ సభ్యులందరితో తినిపించాలని నిర్ణయించుకున్నాడు.

ఇంట్లో రాక్షసులు ఉన్నారని..

ఇంట్లో వింత వింత ప్రవర్తిస్తున్న పౌల్‌ ప్రవర్తను చూసి అంకుల్‌ కుటుంబ సభ్యులు బయటకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పౌల్‌ అంకుల్‌తో పాటు ఆయన నాలుగేళ్ల కుమార్తెను హతమార్చాడు. అంకుల్‌ భార్యను నానా చిత్రహింసకు గురి చేస్తుండగా ఎలాగోలా తప్పించుకుని బయట పడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పౌల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

పోలీసులు పౌల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తుండా కొన్ని విస్తుపోయే అంశాలు పౌల్‌ చెప్పుకొచ్చాడు. తన అంకుల్‌ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా రాక్షసులు ఉన్నారని.. వారిని తరిమేందుకే గుండెను వండిన కూర తినిపించేందుకు సిద్ధమయ్యానన్నారు. నామాట కాదనండంతో చంపేశానని.. నేనలా చేయకపోయింటే ఆ రాక్షసులు అంకుల్‌ కుటుంబ సభ్యులను ఆవహించి నానా తిప్పలు పెట్టి వారితో పాటు సమీపంలో ఉన్న వారందరినీ చంపేసే వారని పౌల్‌ పోలీసులతో చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news