IPL 2022 : ఐపీఎల్‌లో ల‌క్నో జ‌ట్టుకు షాక్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం

-

ఐపీఎల్ 2022 కోసం గుజరాత్, ల‌క్నో జ‌ట్లు కొత్త‌గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ జ‌ట్లకు విదేశీ ప్లేయ‌ర్లు షాక్ ఇస్తున్నారు. మెగా వేలంలో కొనుగోలు చేసిన విదేశి ఆట‌గాళ్లు వ‌రుస‌గా దూరం అవుతున్నారు. ఇప్ప‌టికే గుజ‌రాత్ మెగా వేలంలో ద‌క్కించుకున్న జెస‌న్ రాయ్ ఐపీఎల్ నుంచి పూర్తిగా త‌ప్ప‌కున్నాడు. తాజా గా మ‌రో కొత్త జ‌ట్టు అయిన ల‌క్నో జ‌ట్టుకు చెందిన మ‌రో విదేశి ఆట‌గాడు మార్క్ వుడ్ కూడా ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యాడు.

కాగ ఈ ఇద్ద‌రు కూడా ఇంగ్లాండ్ దేశానికి చెందిన‌వారే కావ‌డం విశేషం. కాగ జెస‌న్ రాయ్.. బ‌యో బ‌బుల్ భ‌యంతో ఐపీఎల్ కు దూరం కాగ మార్క్ వుడ్ మో చేతి గాయం కార‌ణంగా జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నాడు. కాగ ల‌క్నో జట్టు మార్క్ వుడ్ ను మెగా వేలంలో రూ. 7.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగ మార్క్ వుడ్ ఈ ఐపీఎల్ కు దూరం కావ‌డంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌రొక్క ఆట‌గాన్ని తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. కాగ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news