IPL 2022 : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు షాక్.. కీల‌క బౌల‌ర్ టోర్నీ నుంచి అవుట్

-

వ‌రస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈ సీజ‌న్ లో అద్భతంగా రాణిస్తాడ‌ని భావించిన‌ కీలక బౌల‌ర్ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ ఈ ఏడాది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్న విషయం తెలిసిందే. కాగ నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి మొత్తం దూరం అయ్యాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ గాయ‌ప‌డ్డాడు.

అయితే ఆ గాయం త‌ర్వాత తీవ్రం అయింది. దీంతో నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ కు నెల‌కు పైగా విరామం అవ‌స‌రం అని వైద్యులు తెలిపారు. దీంతో నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ ఈ సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ ఇప్ప‌టికే ఆస్ట్రేలియాకు వెళ్లిపోవ‌డానికి సిద్ధం అవుతున్నాడు. కాగ నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్.. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన తొలి మ్యాచ్ లో 3 ఓవ‌ర్లు మాత్ర‌మే వేశాడు. త‌ర్వాత గాయం కావ‌డంతో త‌ర్వాతి మ్యాచ్ ల‌కు కూడా అందుబాటులో లేడు.

Read more RELATED
Recommended to you

Latest news