ఐపీఎల్ 2023 : బెంగుళూరు తో మ్యాచ్ లో కోల్కతా గెలుపు బాట పట్టేనా ?

-

బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో ఈ రోజు కాసేపటి తర్వాత బెంగుళూరు మరియు కోల్కతా ల మధ్యన మ్యాచ్ జరగనుంది. మొదటగా టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, బెంగుళూరు గ్రౌండ్ చిన్నది కావడం వలన ఛేజింగ్ చేయడానికి ఈజీ గా ఉంటుందని ఆలోచన అని చెప్పాడు కోహ్లీ. అయితే రెండు వారాల క్రితం గుజరాత్ టైటాన్స్ మీద లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో గెలిచిన కోల్కతా.. తర్వాత ఆడిన అన్ని మ్యాచ్ లను ఓడిపోయింది. ఈ రోజు అయినా కోల్కతా గెలిచి మళ్ళీ గెలుపు బాట పట్టాలని చాలా కోల్కతా యాజమాన్యం మరియు అభిమానులు కోరుకుంటున్నారు.

మరి ఇప్పటి వరకు కోల్కతా చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లను సర్దుబాటు చేసుకుని విజయాలను అలవాటు చేసుకుంటుందా తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news