ఐపీఎల్ 2023: అదరగొట్టిన జైస్వాల్… భారీ స్కోర్ దిశగా రాజస్థాన్ !

-

ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదట టాస్ గెలిచిన సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకుని చెన్నై ముందు ఎక్కువ టార్గెట్ ను పెట్టి ఒత్తిడి తీసుకురావడానికి ప్లాన్ చేశారు. సంజు అనుకున్నట్లుగానే రాజస్థాన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇతను ఆరంభం నుండి ఫోర్లు మరియు సిక్సులు కొట్టి అలరించాడు. మరోసారి బట్లర్ కు మంచి స్టార్ట్ లభించినా మంచి స్కోర్ ను చేయడంలో ఫీల్ అయ్యాడు.

కాగా శాంసన్ కూడా పరుగులు చేయడంలో విఫలం అయ్యి రాజస్థాన్ మధ్యలో స్లో అయింది. ఒక్క జైస్వాల్ మాత్రమే 43 బంతుల్లో 77 పరుగులు చేసాడు. ఈ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు మరియు 4 సిక్సులు ఉన్నాయి. మరి రాజస్థాన్ నిర్ణీత ఓవర్ లలో పెద్ద టార్గెట్ ను సాధిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news