విషాదం: 24 గంటల్లో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు సూసైడ్ !

-

నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఏదైనా ఒక పరీక్ష అన్న తర్వాత ఫెయిల్ మరియు పాస్ అవడం మాములే. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుని మళ్ళీ అందులో పాస్ అయ్యేలా ప్రిపేర్ అవ్వాలి. అంతే కానీ.. క్షణిక ఆవేశానికి లోనై లేదా ఇతరుల మాటలకు ప్రభావితం అయ్యి దేవుడు మనకు ఇచ్చిన మంచి జీవితాన్ని వదిలేయడం కరెక్ట్ కాదు. తాజాగా నిన్నటి నుండి మొత్తం ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని తమ ప్రాణాలను బలి తీసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లా గోపాలపురానికి చెందిన తరుణ్, విశాఖపట్టణం జిల్లా తిరునాధపురానికి చెందిన అఖిల అనే అమ్మాయి మరియు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చనిదినా బాబు లు సూసైడ్ చేసుకున్నారు. ఇకనైనా విద్యార్థులు తెలుసుకుని ఈ ప్రాణాలను తీసుకోవడం ఆపాలి.

Read more RELATED
Recommended to you

Latest news