IPL 2024 : ముగిసిన లక్నో ఇన్నింగ్స్… ఆర్సిబి టార్గెట్ ఎంతంటే?

-

ఐపీఎల్ లో 17 వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లక్నో కి నికోలస్ పూరన్ కెప్టెన్ గా వ్యవహరించగా.. ఇవాళ కే.ఎల్.రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.ఇక బ్యాటింగ్ కి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదువేల నష్టానికి 181 పరుగులు చేసింది.

క్రీజ్లో కుదురుకున్నట్టు కనిపించిన కె ఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.20 పరుగులు చేసిన రాహుల్ మయాంక్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరోవైపు సౌత్ ఆఫ్రికా బ్యాటర్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. లక్నో బ్యాటర్స్ లో పూరన్ 40 పరుగులు,స్తోయినిస్ 24 పరుగులు చేశారు. భారత్ యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో టాప్లే ,మొహమ్మద్ సిరాజ్ ,యశ్ దయాళ్ చెరో వికెట్ తీయగా,మాక్స్ వెల్ 2 వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news