హైదరాబాద్ నుండి గుజరాత్ వెళ్లాలనుకుంటున్నారా..?అయితే ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్లాన్ చూడాల్సిందే..!

-

మీరు ఏదైనా టూర్ వేయాలనుకుంటున్నారా..? అది కూడా బడ్జెట్ లోనే ఉంటే బాగుంటుందనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ వివరాలు మీకోసం. ఇప్పటికే ఎన్నో టూర్ ప్యాకేజీలను IRCTC తీసుకొచ్చింది. ఇప్పుడు సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ ని తీసుకు రావడం జరిగింది. దీనితో చక్కగా గుజరాత్ ని చూసి వచ్చేయచ్చు.

పూర్తి వివరాలలోకి వెళితే.. అద్భుతమైన గుజరాత్ రాష్ట్రాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకునే వారు సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ వేసి గుజరాత్ ని చూసి వచ్చేయచ్చు. ట్విట్టర్‌ పేజీలో సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ గురించి IRCTC తెలిపింది. మొత్తం 6 రాత్రులు, 7 రోజులు టూర్ ఇది. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ఈ టూర్ లో హైలైట్.

అక్టోబరు 29న హైదరాబాద్‌ నుంచి టూర్‌ మొదలు అవుతుంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో వెళ్ళాలి. ముందుగా బుక్ చేసుకునే వారికే ఈ టూర్ వెళ్లే అవకాశం అని సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ గురించి IRCTC తెలిపింది.

ఇక ఎంత ఖర్చు అవుతుంది అనేది చూస్తే.. ఒక్క టూరిస్ట్‌కు రూ.38,350 ఖర్చు అవుతుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీకి అయితే ఒక్కో వ్యక్తికి రూ.29,650 అవుతుంది. అదే కనుక ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే ఒక్కొక్కరికి రూ.28,500 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను www.irctctourism.com ను చూసి తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news