జబర్దస్త్ లో మంజూషా కి అవకాశం రావడానికి కారణం ఆమెనా..?

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో జబర్దస్త్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.ఇక ఈ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు కమెడియన్ లుగా మారడమే కాకుండా తమలోని టాలెంటును ప్రేక్షకులకు చూపించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే వారు సినిమాలలో కూడా అవకాశాలు సంపాదించుకోవడం గమనార్హం. ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో నటిస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ లో అల్లకల్లోలం మొదలైన విషయం తెలిసిందే.. ఈ షో నుంచి రోజా తప్పుకోవడం ఆ తర్వాత సుడిగాలి సుదీర్, హైపర్ ఆది కూడా వెళ్లిపోవడం జరిగింది.

ఇక రీసెంట్ గా అందాల ముద్దుగుమ్మ కుర్ర కారు ఫేవరెట్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే అలనాటి యాంకర్ మంజూషా కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇక త్వరలోనే మంజూష జబర్దస్త్ వేదికపై యాంకర్ గా వ్యవహరించడానికి సిద్ధం అవుతోంది. మొన్నటి వరకు సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉన్న మంజూష ఇటీవల తన హాట్ అందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను విపరీతంగా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోని ఆమెకు జబర్దస్త్ అవకాశం వచ్చిందని అందరూ అనుకుంటున్నారు కానీ. ఇది ఏమాత్రం నిజం కాదు మంజుష కి జబర్దస్త్ నుంచి ఆఫర్ రావడానికి కారణం ప్రముఖ యాంకర్ శ్రీముఖి అని సమాచారం.

అసలు విషయంలోకి వెళ్తే 2013లో జబర్దస్త్ కార్యక్రమం మొదలైనప్పుడు యాంకర్ గా మల్లెమాల యూనిట్ శ్రీముఖిని సంప్రదించారు. కానీ ఎందుకో ఆమె ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత అనసూయ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఫ్యాన్స్, ఫేమ్ తో పాటు క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇటీవల అనసూయ కూడా వెళ్లిపోవడంతో మరొకసారి మల్లెమాల యూనిట్ శ్రీముఖిని జబర్దస్త్ లో యాంకర్ గా చేయమని అడిగారట. కానీ రెండవసారి కూడా ఆమె ఆఫర్ ను తిరస్కరించింది. కానీ ఎట్టకేలకు ఈ ఆఫర్ మంజూషా కి దక్కిందని సమాచారం. ఇకపోతే శ్రీముఖి ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news