నేను మీడియా రంగంలోకి వస్తున్నాను….కొత్త ఛానల్ పెడతా – విజయసాయి

-

నేను మీడియా రంగంలోకి వస్తున్నాను….కొత్త ఛానల్ పెడతానని సంచలన ప్రకటన చేశారు విజయసాయి రెడ్డి. విశాఖ భూములపై ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను…. సీబీఐ, ఈడీ, ఎఫ్.బి.ఐ., విచారణకు సిద్ధంగా ఉన్నానని తాజాగా ప్రకటించారు. నేను ఇప్పటి వరకు వ్యాపారం చెయ్యలేదన్నారు విజయసాయిరెడ్డి. నాకు విశాఖలో ఒకటే ఒక ఫ్లాట్ ఉంది….అంతకు మించి నాకు ఆస్తులు లేవన్నారు.

నా కుమార్తె అత్తింటి కుటుంబం 40 ఏళ్లుగా వ్యాపార రంగంలో వున్నారని.. నా వియ్యంకుడు కుటుంబం ఆస్తులు కొనుగోలు చేస్తే నాకేమి సంబంధం అని నిలదీశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారు…వైసీపీ పై దురుద్దేశంతో దుష్ప్రచారం జరుగుతోందని ఆగ్రహించారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను అడ్డుకోవడం…..అమరావతి భూములతో లక్షల కోట్లు సంపాదించాలనే కుట్రలో భాగమేనన్నారు. కొన్ని పత్రికలు వార్తలను కులం అనే పచ్చ ఇంకుతో రాస్తున్నాయి….విషపు రాతలు రాసే మీడియాకు వైసీపీ ఏమి చేసిన తప్పుగానే కనిపిస్తుందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news