అదే చంద్రబాబుకు ఆయుష్షు పెంచుతుంది : నారా భువనేశ్వరి

-

పెన్షన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని నారా భువనేశ్వరి విమర్శించారు. వైసీపీ నేతలు చంద్రబాబు పేరును రోజు మొత్తం జపం చేస్తున్నారు. అదే ఆయనకు ఆయుష్షు పెంచుతుందని చెప్పారు భువనేశ్వరి. టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4వేల పెన్షన్ ను ఇంటి వద్దకే పంపిస్తారని స్పష్టం చేశారు.

‘రాష్ట్రాభివృద్ధిని మరిచి ప్రజలను హింసించడం, వేధించడం, చంపడమే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతోంది. ప్రజలకు పింఛన్లు పంపిణీ చేయడానికి కూడా వైసీపీ శవరాజకీయాలకు పాల్పడుతోంది. జగన్ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. విద్యావంతులైన యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. మళ్లీ మంతు రోజులు రావడానికి ఈ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన,బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news