బీజేపీ కీలక నేతల అరెస్ట్ !

-

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ బీజేపీ జనరల్ సెక్రటరీ మీద దాడికి దిగిన అంశం సంచలనం రేపింది. నిన్న అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో ఉన్న 126 డివిజన్ కార్పొరేటర్ జగన్ వీరంగం సృష్టించాడు. ఒక మహిళ మీద దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ అంశం మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ కీలక నేతలు కొలన్ హన్మంత్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, భరత్ సింహా రెడ్డిలను జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కార్పొరేటర్ జగన్, అతని అభిమానులు మహిళలనే విషయం కూడా చూడకుండా కడుపులో గుద్దారని వారిని కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు గొడవకు సంబంధించిన వీడియోను తీసుకున్నా సరయిన చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

 

 

Read more RELATED
Recommended to you

Latest news