తనను నమ్మిన వారిని నెత్తిన పెట్టుకున్న జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను నమ్మిన వారిని నెత్తిన పెట్టుకున్నారు. తన కోసం పదవులు వదులుకున్న వారిని రాజ్యసభకు పంపిస్తున్నారు. 2012 లో జగన్ ని అరెస్ట్ చేసారు. ఆ సమయంలోనే అప్పుడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ను కూడా అరెస్ట్ చేసారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో మోపిదేవి బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పుడు జగన్ జైల్లో ఉన్నారు.

జగన్ జైల్లో ఉన్న సమయంలోనే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతకు ముందే కాంగ్రెస్ లో మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిచారు పిల్లి సుభాష్ చంద్రబోస్. గుంటూరు జిల్లాలో మోపిదేవి పెద్ద బలమైన నేత కాదు. అయినా సరే జగన్ కోసం ఆయన ముందుకి వచ్చారు. అప్పుడు జగన్ కోసం రావాలా వద్దా అనుకుంటున్న నేతలు మోపిదేవి తర్వాత బయటకు వచ్చేశారు.

అప్పటి నుంచి జగన్ తోనే వాళ్ళు కలిసి ప్రయాణం చేసారు. ఎమ్మెల్యేలు గా గెలిచినా ఓడిపోయినా సరే జగన్ వెంటే ఉన్నారు వాళ్ళు. దీనితో జగన్ వారికి పదవులు ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కాకపోయినా సరే ఎమ్మెల్సీలను చేసి మరీ పదవులు ఇచ్చారు. వారి విషయంలో జగన్ ముందు నుంచి సానుకూలంగానే ఉన్నారు. వారు అసంతృప్తిగా ఉంటే వారిని బుజ్జగించే వారు జగన్.

వాళ్ళ మాటకు విలువ ఇచ్చే వారు. సాధారణంగా జగన్ ఎవరి మాటా వినే ప్రయత్నం చేయరు. అలాంటిది వారి మాట వింటారని అంటూ ఉంటారు. అందుకే మండలి రద్దు కావడంతో వారిని వెంటనే రాజ్యసభ కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు కూడా వాళ్లకు నమ్మకస్తులు గా ఒక విలువ ఉండేది. జగన్ తో వాళ్ళు సన్నిహితంగా ఉండే వారు. అందుకే జగన్ ఇప్పుడు వారి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news