చంద్రబాబు లాగా చెవిలో పువ్వులు పెట్టకు జగన్ బాబూ .. !

-

2014 ఎన్నికల టైం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు దాదాపు 600 లకు పైగా హామీలు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇదే అస్త్రాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షంలో ఉన్న జగన్ తన పాదయాత్ర అంట 2014 టిడిపి మేనిఫెస్టో మరోపక్క తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అన్న దాని విషయంలో ప్రసంగిస్తూ పాదయాత్ర మరియు ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు.Image result for jagan vs chandrababu smilingఇక్కడ దాకా బాగానే ఉన్నా గాని ఇటీవల జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను విని కొంతమంది చంద్రబాబు లాగా జగన్ కూడా చెవిలో పువ్వులు పెడతా కి రెడీ అవుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే 16 సంవత్సరాల నుండి పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది. చాలా మంది ముఖ్యమంత్రులు రావటం పోలవరం ప్రాజెక్ట్ అతిపెద్ద ప్రాజెక్టు అని మాట్లాడుతూ ప్రాజెక్టు అడ్డంపెట్టుకుని రాజకీయం చేయడం జరిగింది.

 

గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో పెద్దగా సాధించింది ఏమీ లేదు. అయితే ఈ సందర్భంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ 16 నెలల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నట్లు అధికారులకు తెలపడం జరిగింది. ఈ సందర్భంలో పునరావాస బాధితులతో మాట్లాడిన జగన్ త్వరలోనే వాళ్లకి భూములు కొని ఇల్లు కట్టే ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఈ విధంగానే చంద్రబాబు చెవిలో పువ్వులు పెట్టాడు…నువ్వు కూడా అంటూ జగన్ ని ఉద్దేశించి మా చెవిలో పువ్వులు పెట్టకు..మా జీవితాలతో ఆడుకోవద్దు అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి నిధులే లేకపోతే మాకు భూములు కొని పునరావాస లు ఎలా కల్పిస్తారు అంటూ కొంతమంది జగన్ ప్రభుత్వం పై ప్రశ్నలు వేస్తున్నారు. ఇదంతా రాజకీయ డ్రామా అని మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news