జగన్ గుడ్ న్యూస్..జూలై 15న అకౌంట్లోకి రూ.10 వేలు జమ..!!

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.అందులో వాహన మిత్ర కూడా ఒకటి..ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ది పొందారు.ఈనెల 15న విశాఖ జిల్లాలో ఇరవై వేల మంది లబ్దిదారులు వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర పరిశ్రమలూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెళ్లడించారు. రాష్ట్రంలో 2.61 లక్షల మందికి రూ.261 కోట్ల రూపాయలను వాహన మిత్ర పథకంగా పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ- ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో 15వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్‌ సోమవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లు- వివరాలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లికార్జునను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే మూడు విడతలుగా వాహన మిత్ర లబ్ధిదారులకు సుమారు 750 కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు.. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలకు మంచి ఆదరణ లభించింది.మున్ముందు మరిన్ని పథకాలను అమలు చేస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news