రైతులకు జగన్ సర్కార్ శుభవార్త..50 శాతం సబ్సిడీతో కొత్త పరికరాలు..

-

భారత దేశంలో రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను అమలు చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా రైతులకు లబ్ది చేకూరుతుంది.. ఏపీ ప్రభుత్వం మాత్రం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా నాటు వేసినప్పటి నుంచి పంట విక్రయించేవరకు అన్ని పనులను చక్కబెడుతోంది. అలాగే కమ్యూనిటీ హైరింగ్ పద్ధతిలో ట్రాక్టర్లు, యంత్రపరికరాలను అందిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం.. రైతులకు సబ్సిడీపై యంత్రపరికరాలను అందేంచేందుకు కసరత్తు చేస్తోంది.
ముఖ్యంగా రైతులకు కూలీల కొరత తగ్గించేందుకు, వారి పనులు వేగంగా పూర్తయ్యేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయ పడుతుంది.రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. అద్దె ప్రాతిపదికన వ్యవహాయ యంత్ర పరికరాలను అందిస్తోంది.ఇప్పుడు మాత్రం రైతులకు స్వయంగా యంత్రాలను అందించాలని యోచనలో ఉంది.

ఈ మేరకు 50శాతం సబ్సిడీతో రూ.403 కోట్ల విలువైన పరికరాలను రైతులకు అందించనుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 కోట్ల అంచనా వ్యవయంతో ఆర్బీకే స్థాయిలోనే రూ.6లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల విలువైమ 10,750 వైఎస్ఆర్ యంత్రసేవా కేంద్రాలు, వరి ఎక్కువ పండించే ప్రాంతాల్లో రూ.10 లక్షల సబ్సిడీతో రూ.25లక్షలు విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్ తో కూడిన 1,615 క్లస్టర్ లెవల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల వ్యయంతో 6,781 రైతు భరోసా కేంద్రాలు, 391 క్లస్టర్ లెవల్ యంత్రసేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవలై రైతు రథం పేరుతో రూ.175 కోట్లతో రూ.3,800 ట్రాక్టర్లను రైతులకు అందించిన అధికారులు, ఇప్పుడు పరికరాలను కూడా అందించనున్నారు.

రాష్ట్రంలో ప్రతి గ్రామానికి 20 మంది చొప్పున రైతులను ఎంపిక చేసిన ప్రభుత్వం మొత్తం లక్షా 80వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరిచింది. వీరిలో అత్యధికంగా 34శాతం మంది పురుగు ముందులు చల్లేందుకు స్ప్రేయర్లు కావాలని కోరారు. 25 శాతం మంది టార్పాలిన్సు, 15శాతం మంది భూమిని చదును చేసేందుకు కల్టివేటర్ల వంటి పరికరాలు కావాలన్నారు. 12 శాతం మంది.. సెల్ప్‌ ప్రొపెల్డ్‌ ఇంప్లిమెంట్స్‌ 9 శాతం మంది రోటోవేటర్స్, 4 శాతం మంది సీడింగ్‌ పరికరాలు ఒక శాతం మంది మిస్క్‌ ఎక్విప్‌మెంట్‌ కావాలన్నారు..

గ్రామానికి 25 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 68వేల మందిని ఎంపిక చేసి రూ.15వేల విలువైన వ్యవసాయ యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే గ్రామానికి 8 మంది చొప్పున మొత్తం 80 వేల మందికి రూ.50వేల విలువన రెండు యూనిట్లను 50శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నారు..మొత్తం 403 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news