జగన్ లో విజయసాయి టెన్షన్…!

-

కరోనా వైరస్ పై పోరాటంలో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రోజు రోజుకి కరోనా కిట్స్ వ్యవహారం తీవ్ర స్థాయిలో ముదురుతుంది. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి పదే పదే సోషల్ మీడియాలో దీనిపై పోస్ట్ లు చేస్తున్నారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు ఆయనకు మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. కిట్స్ ని ఎక్కువ ధరకు కొన్నారు అంటూ కన్నా ఆరోపించడం,

అది వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళడం జరిగాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటీ అంటే, ఆంధ్రప్రదేశ్ లో కిట్స్ వ్యవహారంలో టీడీపీ ముందు అసలు విషయాన్ని బయటపెట్టినా ఆ తర్వాత దాని గురించి ఎక్కువ హడావుడి చేసింది మాత్రం కన్నా లక్ష్మీ నారాయణ. కన్నా చేస్తున్న విమర్శలు ఎక్కువగా జనాల్లోకి వెళ్ళాయి అనేది వాస్తవం. ఆయన మాట్లాడుతున్న మాటలకు మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. విజయసాయి కూడా కన్నా విషయంలో ఆత్మ రక్షణలో పడ్డారు. తనకు తానుగా ఆయన ట్వీట్ లు చేయడం,

అది మీడియా డైవర్ట్ అవ్వడం తో విజయసాయి అసలు విషయాన్ని వదిలేసారు అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. విజయసాయి ఆరోపణల మీద ఇప్పుడు జగన్ కూడా అసహనంగానే ఉన్నారు. అనవసరంగా బిజెపికి మనకు మధ్య గ్యాప్ పెరుగుతుంది అనే అభిప్రాయం జగన్ లో ఉందని అంటున్నారు. కన్నాకు రాష్ట్ర బిజెపి కూడా మద్దతుగా నిలిచింది. అటు ఇతర పక్షాలు కూడా కన్నా కు అండగా ఉన్నాయి. దీనితో ఇప్పుడు అధికార పక్షం ఏకాకి అయితే అటు కేంద్రంలో జగన్ కు, పెద్దలకు మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news