ఈనెల 13న విశాఖ పర్యటనకు జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన విశాఖపట్నంలో పర్యటిస్తారని సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు.. 13వ తేదీన ఉదయం 10:30 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఉదయం 11.05 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి చేరుకుంటారు. 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైయస్సార్ వాహన మిత్ర ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకిస్తారు. ఆ తరువాత వైయస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్ జరుగుతుంది.

11. 40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి. ఉదయం 11.45 నుంచి 11.47 గంటల వరకు వాహనమిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి మధ్యాహ్నం 12.17 గంటల వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12:20 నుంచి వైయస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. 12:30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు సీఎం. 12. 55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు.1.30 గంటలకు తిరిగి గన్నవరం బయలుదేరుతారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news