మద్యం ధరలపై అసెంబ్లీలో జగన్ కీలక ప్రకటన

-

అసెంబ్లీ సాక్షిగా ఇవాళ… ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మద్యం ధరలపై కీలక ప్రకటన చేశారు. మద్య పాన నిషేధాన్ని తమ ప్రభుత్వం చాలా విజయ వంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు సీఎం జగన్. మద్యం అమ్మకాల లెక్కలే దీనికి నిదర్శనమన్నారు. చంద్ర బాబు సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు…మద్యంపై నెలకు 31 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తే… తమ ప్రభుత్వం లో 21 కోట్లే ఆదాయం వస్తుందన్నారు సీఎం జగన్‌.

అలాగే… టీడీపీ హాయంలో ప్రతి నెల 15 లక్షల కేస్‌ లు అమ్మేవారని… తమ ప్రభుత్వంలో… 7 లక్షల కేస్‌ లు మాత్రమే అమ్ముతున్నారని తెలిపారు. తమ హాయంలో… మద్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయని… వెల్లడించారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఏపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోంది.. తొలిసారిగా ఎస్‌ఈసీగా మహిళను నియమించాం.. వాలంటీర్లలో 53 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. మహిళల కోసం దిశా యాప్ తీసుకువచ్చాం… సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news