రేవంత్‌ ను మార్చండి..సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి ఫిర్యాదు

-

కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధలకు జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పై జగ్గా రెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్‌ రెడ్డి తప్పించాలని లేఖ లో డిమాండ్‌ చేశారు జగ్గారెడ్డి. పార్టీలో అందరినీ కలుపుకుని పోయే నాయకులను పీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

లేదంటే.. పార్టీ డైరెక్షన్‌ లోనే రేవంత్‌ రెడ్డి నడిచేలా.. అధిష్టానం చూడాలని డిమాండ్‌ చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ లైన్‌ లో కంటే.. తన వ్యక్తి గత ఇమేజ్‌ కోసమే.. రేవంత్‌ రెడ్డి పని చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇలాగే రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తే.. కాంగ్రెస్‌ పార్టీకి.. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news