కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో భర్త సమాధి వద్ద పెళ్లిరోజు

-

వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన సుదర్శన్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 2014 మార్చి 3 న అతనికి ప్రవళికతో వివాహం జరిగింది. అతను ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకునేవారు. ఈసారి భర్త భౌతికంగా దూరమైనా అతనితో అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ భర్త సమాధి వద్ద పూలతో అలంకరించి కేక్ కట్ చేసి ప్రవళిక గురువారం పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సంఘటన చూపరుల హృదయాలను కలచివేసింది

Read more RELATED
Recommended to you

Latest news