కాకినాడలో జనసేనాని టూర్ టెన్షన్‌.. టెన్షన్‌..

-

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో కాకినాడలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌… వైసీపీ దాడుల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించనున్నారు. మ‌రోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటికే నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు, విశాఖ నుంచి కాకినాడకు వెళ్లనున్నారు.

గాయపడిన కార్యకర్తలను పరామర్శించాక జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని పలు ప్రధాన కేంద్రాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ద్వారంపూడి నివాసానికి 100 మీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news