తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన..!?

-

పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని అంటున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలవనున్న జనసేన అధినేత… కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.

గ్రేటర్ ఎన్నికల వేళ ఈ పర్యటన ఆసక్తి రేపుతోన్న క్రమంలో GHMC ఎన్నికల్లో వెనక్కి తగ్గినందుకు గాను తిరుపతి యూప ఎన్నికలల్లో తమకు సీట్ కేటాయించాలని కోరునున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం మీద చర్చలు జరపడానికే పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు చెబుతున్నారు.  చర్చల్లో పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొననున్నారు. తిరుపతి లోకసభ  నియోజకవర్గం పరిధిలో ఓట్లు తమకు ఎక్కువగా ఉన్నాయని జనసేన లెక్కలు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news