కాపులు ఓట్లు వేస్తే జనసేన అధికారంలోకి వచ్చి ఉండేది: పవన్ కళ్యాణ్

-

కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సర్కారు ‘కోనసీమ ‘ జిల్లా పేరును వాడుకుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికార పక్షానికి చెందిన వర్గ పోరాటాన్ని.. కులాల మధ్య చిచ్చు గా మార్చారని మండిపడ్డారు. వైసీపీకి అన్ని వర్గాలు దూరం అవుతున్నాయని.. జగన్ ఒంటరిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.”

రోజు భయంతో బతకాలని ఎవరూ అనుకోరు.. అందుకే వైసీపీని ప్రజలు మరోసారి గెలిపించరు” అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని.. ఈ విషయం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. దేశ రాజకీయాలన్ని కులాల తో ముడిపడి ఉన్నాయన్నది నిజం అని జనసేనాని అన్నారు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. కాపులు వందకు వందశాతం తమకు ఓటు వేస్తే జనసేన అధికారంలోకి వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news