ముంబై ఇండియన్స్ కు షాక్… ఐపీఎల్ నుంచి పేసర్ బుమ్రా అవుట్!

-

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఈ ఐపీఎల్‌ లీగ్‌ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది.

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023 సీజన్ కు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అతడు మైదానంలో దిగడానికి మరో ఏడెనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపిఎల్ తో పాటు జూన్ లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చునని అంటున్నారు.

కాగా, మార్చి 31వ తేదీన తొలి మ్యాచ్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ధోని కెప్టెన్సీ వహిస్తున్న చేత సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ టోర్నీలో పది టీమ్స్ 70 మ్యాచ్లు 52 రోజులపాటు ఆడనున్నాయి. దేశంలోని 12 స్టేడియాలలో ఈ ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇది ఇలా ఉండగా, ఐపిఎల్ 2023 సీజన్ లో ఈ సారి హైదరాబాద్‌ లో 7 మ్యాచ్‌ లు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news