టీడీపీ వల్లే తెలంగాణకు అన్నం..చంద్రబాబు వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి సీరియస్‌

-

తెలంగాణ వాళ్లు బియ్యంతో అన్నం వండుకొని తింటున్నారంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీ దేనిని తెలిపారు. టిడిపి రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు తినేవారని, టిడిపి వచ్చాక బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారని వాక్యానించారు. అయితే, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే, తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డీ నిరంజన్ రె డ్డి. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని… ఆఖరుకు రూ.2కు కిలోబియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారని ఫైర్‌ అయ్యారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రూ.2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటయింది అని చంద్రబాబు చెప్పడం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. మూర్ఖపు అహం కారానికీ పరాకాష్ట అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news