విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా – జేడీ లక్ష్మీనారాయణ

-

సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడం పక్క అంటున్నారు జేడీ. ఆయన ఓటమిపాలైన లోక్సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆయన స్వచ్ఛంద సంస్థ జాయిన్ ఫర్ డెవలప్మెంట్ జేడీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

పలు పార్టీలో ఆయనకి ఆహ్వానం పలికాయని.. కానీ సిద్ధాంతాలు కలవక పోవడం వల్ల ఏ పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. విశాఖ ఈస్ట్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ గా ఆయన కూతురు, జెడి టీం కన్వీనర్ ప్రియాంక దండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news