బందిపోట్ల రాష్ట్ర సమితి కేటుగాళ్లకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు – వైఎస్ షర్మిల

-

బందిపోట్ల రాష్ట్ర సమితి కేటుగాళ్లకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. KCR అంటే కాలువలు,చెరువులు, రిజర్వాయర్ లు కాదు చిన్న దొర అని..K అంటే “కన్నీళ్లు” C అంటే “చావులు”R అంటే “రోదనలు” అంటూ కొత్త అర్థం చెప్పారు.

“రుణమాఫీకి ఎగనామం, ఉచిత ఎరువులకు పంగనామం, సబ్సిడీ విత్తనాలకు కుచ్చుటోపీ పెట్టిండు. గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పి నష్టపరిహారం ఎగ్గొట్టిండు. అప్పులపాలై రైతులు..ఉరికంభం ఎక్కుతున్నా, కల్లాలపైనే గుండెలు ఆగిపోతున్నా, పురుగుల మందు తాగి నురుగలు కక్కి చచ్చిపోతున్నా.. ఇక్కడి దొరకు పంజాబ్, హర్యానా రైతులే కనబడుతారు. భూస్వాములకు లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిది.

60ఏండ్లకే రైతు బీమాను పరిమితం చేసి, రైతు నుదుట మరణ శాసనం రాస్తున్న దాష్టీక ప్రభుత్వమిది. భూములకు సాగు నీరు అందక, పంటలకు మద్దతు ధర లేక, పండించిన పంటను కొనే దిక్కులేక రైతులు ఆగమైతున్నా.. దొరగారు గడీ దాటి బయటకు రారు. రైతులకు భరోసా ఇవ్వని బంధిపోట్ల రాష్ట్ర సమితి కేటుగాళ్లకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు” అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news