విద్యార్థులకు అలర్ట్..జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 తుది కీ విడుదల

-

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 తుది కీని జాతీయ పరీక్షల సంస్థ సోమవారం రాత్రి విడుదల చేసింది. తొలి విడత పరీక్షలు ఈనెల 1న ముగిసిన సంగతి తెలిసిందే. బిటెక్ సీట్ల కోసం ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 8.60 లక్షల మంది రాయగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది ఉన్నారు.

తుది కీ విడుదల చేసిన నేపథ్యంలో ఏ క్షణంలో అయినా విద్యార్థుల స్కోర్ ను వెల్లడించనున్నారు. అంటే మంగళవారం ఫలితాలు వెలవడనున్నాయి. మరోవైపు చివరి విడత పరీక్షలు ఏప్రిల్ లో జరగనుండగా, దానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది.

జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 తుది కీ కోసం ఈ  https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి. 

Read more RELATED
Recommended to you

Latest news