గంజాయి సాగును పెంచి, పోషించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం : జోగి రమేష్‌

-

టీడీపీ, జనసేనపై మరోసారి విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పడం గాడు లోకేష్, పప్పు, తుప్పు, అప్పడం.. గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో గంజాయి పెరిగి పోతోందని ఫిర్యాదు చేశాడు. వార్డు మెంబర్ గా గెలవలేని లోకేష్‌కు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తుంటే కనిపించటం లేదా?? అని ఆయన ప్రశ్నించారు. గంజాయి సాగును పెంచి, పోషించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వమని, అప్పుడు మంత్రులు గంజాయి అమ్మి బతికారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఒకడు వృద్ధ సైకో, ఒకడు పిల్ల సైకో… ఇంకొకడు అసలైన సైకో. రంకేలు వేస్తుంటాడు… చర్చకు రమ్మంటే పారిపోతాడు.

ఉనికి కోసమే బాబు, పవన్ ప్రయత్నాలు-ముద్రగడ లేఖ చదివితే జంప్ ! మంత్రి జోగి  కామెంట్స్.. | ap minister Jogi Ramesh slams Chandrababu, pawan kalyan for  thier politics - Telugu Oneindia

రాష్ట్రానికి ముగ్గురు సైకోలు తగిలారు. ఏపీ రాష్ట్రానికి పట్టిన సైతాను చంద్రబాబు, భూతం లోకేష్, పిశాచం పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా ఉన్న గంటా, అయ్యన్నే స్వయంగా గంజాయి సాగుకు విశాఖ కేంద్రంగా మారిందని చెప్పారు. గంజాయి సాగు వెనుక పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారని స్పష్టంగా చెప్పారు. పెద్ద వాళ్ళంటే ఎవరు??. చంద్రబాబు, లోకేష్ గంజాయి సాగు వెనుక ఉన్నారని గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడే చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కు తెలియకుండానే గంజాయి స్మగ్లింగ్ జరిగిందా??. బుర్ర తక్కువ వెధవ లోకేష్ … గంజాయి తాగి ఊగుతున్నారా?? గంటా, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల పై ఏం సమాధానం చెబుతారు?? టీడీపీ హయాంలో గంజాయి స్మగ్లింగ్ చేశారా లేదా. ఈ దరిద్రం అంతా జగన్ శుభ్రం చేస్తున్నారు. గంజాయి సాగు జరగకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు మంత్రి జోగి రమేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news