KCR దీనికి సమాధానం చెప్పగలరా? : జేపీ నడ్డా

-

కుమార్తె కవితను CBI ఎందుకు విచారించిందో KCR సమాధానం చెప్పగలరా? అని BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ప్రశ్నించారు. ‘TRS ఇప్పుడు BRS అయ్యింది. భవిష్యత్తులో BRS.. VRS తీసుకోవాల్సిందే. KCRకు కుటుంబం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ధరణి పోర్టల్ దోచుకునే మార్గంగా మారింది. తనకోసం ఫాంహౌస్ కట్టుకున్న KCR.. ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సభకు జేపీ నడ్డా హాజరయ్యారు. ‘వేములవాడ రాజన్నకు ప్రణామాలు, కొండగట్టు అంజన్నకు ప్రణామాలు’ అంటూ నడ్డా తన ప్రసంగం ప్రారంభించారు. ఉద్యమాల గడ్డ కరీంనగర్ అని పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం మాత్రమేనని, ఇది ఆగేదికాదని నడ్డా స్పష్టం చేశారు. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం కూడా కొనసాగుతుందని వెల్లడించారు.

Mission 150' for 2023: JP Nadda calls for a unified effort

తెలంగాణను కేసీఆర్ అప్పులకుప్పగా మార్చేశారని, అందినంత దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజలు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నడ్డా వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం, కేసీఆర్ కు విశ్రాంతి అవసరం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news